Search This Blog

26 July 2016

గొట్టిపాటి మీద BTF అధినెత వ్యాక్యలు

Ravinuthala Village


VEERA KANAKAMEDALA


ఇలాంటి వ్యక్తి మన పార్టీ లో ఉంటే పార్టీ కి ఎక్కువ నష్టం.. అధ్యక్షుల వారు దయచేసి గమనించాలి
- జనం అంటే తన వర్గం మనుషులే అంట, వాళ్ళ కోసమే పార్టీ మారాడు అంట
- కరణం బలరాం గారి పేరు కూడా మాట్లాడటానికి ఇష్టపడడు అంట,
- అద్దంకి సీట్ వచ్చే ఎలక్షన్స్ లో తనకే వస్తది అని చెప్తున్నాడు
- పార్టీ లోకి రాగానే అధికారులకి బెదిరింపులు స్టార్ట్ చేసాడు
- Tv9 వాళ్ళు ఇతని నేర చరిత్ర మొత్తం లిస్ట్ ఆధారాలతో చూపిస్తే అన్నీ కేవలం ఆరోపణలు అంటున్నాడు

పార్టీలోకి కేవలం వ్యక్తిగత స్వార్థం తో వచ్చిన వ్యక్తి ఇంతలా పెట్రేగిపోవటం మన కార్యకర్తల కర్మ, YS నా దేవుడు అని చెప్పుకు తిరిగిన వ్యక్తి ఇవ్వాళ మన పార్టీ నాయకుల పైన రెచ్చిపోవటం..
పరిటాల రవన్న హత్య తరువాత, టీడీపీ నాయకులు చాలా మంది వై.ఎస్ కి బయపడి సైలెంట్ అయిపోయినా "కరణం బలరాం" గారు అసెంబ్లీ లోపల, బయట ధైర్యంగా పోరాడారు ,
ఆయన ముందు ఈ వ్యక్తి ఇప్పుడు కుప్పి గంతులు వేస్తున్నాడు,
పిల్లి ఎంత బలిసినా పులి కాదు, కాలేదు
ravinuthala village map
ravinuthala

మా భూమి

Ravinuthala Village

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకొండి...


 రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ "మాభూమి" వెబ్ సైట్ రూపొందించబడినది.


ఆంద్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం  అందిస్తున్న వివిధ రకాల ఉచిత సేవాలు

   

 

Here it is link

http://meebhoomi.ap.gov.in/SearchAdangal.aspx

 

 

 


4 July 2016

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తనను మూడో కొడుకుగా చూసుకునేదని కరణం బలరాం చెప్పారు. నాటి విషయాలను ప్రస్తావించగా ఆయన మాట్లాడుతూ,‘1978లో ఎలక్షన్ టూర్ నిమిత్తం కర్ణాటక నుంచి ఒంగోలుకు వచ్చింది. ఆమెకు ఏర్పాటు చేసిన డయాస్ కూలిపోయింది. మాజీ ప్రధానిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు సరైన భద్రత కల్పించలేదు. ఒక్క పోలీసోడు కూడా లేడు. ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఆమెను ఏదో ఒక విధంగా ఇన్ సల్ట్ చేయాలని చెప్పి, ఆమెకు సెక్యూరిటీ లేకుండా చేశారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను స్వయంగా కారు నడుపుతూ ఆమెను మా జిల్లా దాటించాను. ఇందిరాగాంధీని అలా నేను ప్రొటెక్టు చేసిన తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి జరిగిన మీటింగ్ లో ‘బలరాం ఈజ్ మై థర్డ్ సన్’ అని ఇందిరాగాంధీ అంది. ఇంతకంటే ఏంకావాలి, వందల, వేల కోట్లు వస్తే ఆ తృప్తి వస్తుందా?’ అని బలరాం ప్రశ్నించారు.

నా చివరి శ్వాస వరకు కార్యకర్తల కొసమె...........కరణం

10tv టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 1972 నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, 1978లో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణమూర్తి, తాను కాంగ్రెస్ (ఐ) నుంచి గెలిచామని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆవుదూడ కాంగ్రెస్ నుంచి, వెంకయ్యనాయుడు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1978 నుంచి పదవున్నా, లేకపోయినా ప్రజలకు తాను సేవ చేస్తున్నానని చెప్పారు. 10tv టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, మనల్ని కాపాడే కేడర్ ఉన్నప్పుడు వారికేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని కాపాడాల్పిన బాధ్యత ఆ పార్టీ నాయకుడికి ఉంటుందని అన్నారు.