Search This Blog

26 April 2016

gottipati entry to TDP will not digistive to KARANAM

గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం లోకి రావడానికి అంత సిద్దం అయినది .
రాష్ట్ర స్థాయి పాలసి లో భాగం గా తెలుగుదేశం లో చేరాలనుకునే వై కా పా యం ఎల్ ఏ లను స్వాగతించక తప్పని స్థితి తెలుగుదేశం కార్యకర్తలది మండల స్థాయి నాయకులది .తమకు ఇష్టం ఉన్న లేకున్నా జరిగే దాన్ని ఆపలేని నిస్సహాయ స్థితి ఆ నియోజకవర్గ ఇంచార్జీలది.
గొట్టిపాటి ప్రవేశం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచింది కాబట్టి నిబద్దత కలిగిన కార్యకర్త ల గా నాయకులిగా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు తమ అయిష్టతను లేదా ఇబ్బందిని బయటపెట్టకుండా పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మౌనం గా అంగీకరిస్తున్నారు.
అదే సమయం లో ప్రస్తుతం ఉన్న పని చేస్తున్న ఇంచార్జీ పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు కి భరోసా ఇవ్వాల్సిన అవసరంకూడా ఉంది. గత ఎన్నికల్లో పోరాడి ఆడాడు.
ఓడినా కూడా నిత్యం ప్రజలతో నే తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.ఒక విధం గా నియోజకవర్గం లో పార్టీ పుంజుకున్నది అని వినవస్తున్నది.. అలాంటి స్థితి లో గొట్టిపాటి ని పార్టీ లోకి ఆహ్వానించారు .
తమ ఇష్టైష్టాలు పక్కన పెట్టి వెంకటేష్ కాని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బలరాం గారు మౌనం గా నే అంగీకరించారు
అధిష్టానం నిర్ణయం పాటించారు
కాని
కార్యకర్తల నుంచి కొన్ని సూటి ప్రశ్నలు వినవస్తున్నాయి
1. మనకు నాయకత్వం ఉన్న చోట పక్క పార్టీ నాయకుడిని ఎందుకు తీసుకుంటున్నారు ?
2. ప్రతిపక్షం లో బలమయిననాయకుడు ఉండకూడదు అని తీసుకుంటున్నారు అని అనుకుందాము అంటే ఇప్పటికే ఇక్కడ బలమయిన నాయకుడి గా ఉన్న వ్యక్తీ ని ఏమి చేస్తారు ?
3 ఇంతకాలం పని చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది సొంత పార్టీ నాయకుడికి యువకుడికి పార్టీ చేసే న్యాయం ఏమిటి ?
అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గొట్టిపాటి బలమయిన నాయకుడే కాదనడంలేదు. గొట్టిపాటి వెంకటేష్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కి చెందినవారే. కాబట్టి గొట్టిపాటి రాకను పార్టీ లో ఎవరు పెద్ద గా వ్యతిరేకిన్చ్డంలేదు .
అదే సమయం లో గత పది ఏళ్ళు గా పార్టీ ని అంటిపెట్టుకొని వెంకటేష్ లాంటి యువకుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది
ఇప్పటికి వెంకటేష్ కి ఎటువంటి సూచనలు అందించినట్టు గా కనిపించడం లేదు.
అద్దంకి నియోజకవర్గం మీదే అని గొట్టిపాటికి హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. మరి కరణం పరిస్థితి ఏమిటి ?ఆయన రేపటి నుంచి ఎక్కడ పని చేయాలి ? రాజకీయంగా ఏమి చేయాలి ? అధిష్టానమే ఏదో ఒక మార్గం చూడాల్సిన అవసరం ఉంది. కరణం కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధిస్తానిదే అని కార్యకర్తలు కుండ్ అబద్దాలు కొట్టినట్టు చెప్తున్నారు
కడప జిల్లా జమ్మలమడుగు ప్రకాశం జిల్లా అద్దంకి ఈ రెండు కొంచం సంక్లిష్టం అయినవి
ఇద్దరు నేతలు కలసి పనిచేసే వాతావరణం ఉంటె అది పార్టీ కి వ్యక్తులకి ఇద్దరికీ మేలు జరుగుతది.

24 April 2016

GOTTIPATI WILL JOIN TO TDP ON 29TH APRIL


ఏపీలో అధికార పార్టీ టీడీపీలోకి విపక్ష వైసీపీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై విజయం సాధించిన చాంద్ బాషా టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది. చాంద్ బాషా కండువా మార్చిన మరుక్షణమే... ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి) కూడా సైకిలెక్కడం ఖరారైపోయింది. ఈ నెల 29న గొట్టిపాటి పార్టీ మార్చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరుతున్నట్లు అటు గొట్టిపాటి వర్గీయులతో పాటు ఇటు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.ఇప్పటికె బుజ్జి గ్రామ స్థాయి నేతలతొ చర్చిస్తున్నారు

టిడిపి అదికారం లొకి వచిన తరువాత మొట్ట మొదటి నిర్మాణం రావినూతల లొ

AMARAVATHI

TODAY ADDANKI NEWS

TODAY NEWS


ONE MORE MLA

14 April 2016

దుమ్ము రేపుతున్న చంద్రబాబు.

ఉచ్చ పోసుకుంటున్న ఉద్యోగులు అధికారులు..
ఆటం బాంబు లా ఉంటున్న చంద్రబాబునాయుడు ..
అందుకే ఆయన అడ్మినిస్ట్రేషన్‌ కి అమ్మా మొగుడు అనేదీ.
10:30 కి ఆఫీస్ 11:00 వరకు ఎవరు కనిపించరు 1:00 నుండి 2:00 వరకు లంచ్ బ్రేక్ 3:00 అయినా ఎవ్వరు సీట్లలో కనిపించరు 5:30 వరకు ఆఫీస్ కాని 4:30 కే అందరు బ్యాగ్ లు సర్దేస్తారు.ఎక్కడా?ఏమిటి అనుకుంటున్నారా?అదేనండి విభజన సమయం లో అవసరమయితే ఎక్కువ సమయం కేటాయిస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల తీరు ఇది.ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం సమయ పాలన పై ద్రుష్టి పెట్టింది.
అడిగి మరీ జీతాలు పెంచుకున్న ఉద్యోగులు ఇలా సమయ పాలన పాటించకపోవడం తో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం గా వుంది.ఇందుకోసం తాజా గా ఒక సర్కులర్ కూడా విడుదల చేసింది.ఈ సర్కులర్ ప్రకారం పదిన్నరకల్లా సెక్షన్ ఆఫీసర్ దగ్గర వుండే రిజిస్టర్ లో సంతకం పెట్టాలి.ఒక పది నిముషాలు గ్రేస్ పీరియడ్ వుంటుంది.10:40 కి రిజిస్టర్ డిప్యూటీ సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారి దగ్గరకి వెళ్తుంది.అక్కడ కూడా 11:30 వరకు మాత్రమే వుంటుంది.ఇలా మూడు సార్లు లేట్ అయితే సిఎల్ లేదా ఈఎల్ కట్ చేస్తారు.ఒకవేళ ఈ రెండు లేక పోతే ఎల్వోపి వేస్తారు.11:30 నుంచి 1:30 లోపు వస్తే హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తారు.
ఈ జీవో ని ఖచ్చితం గా పాటించాలని,రిజిస్టర్ లో ల విషయం లో ఖచ్చితం గా వుండాలని ఇటు ఉద్యోగులకు,అటు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారి చేసింది ప్రభుత్వం.చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తుండడం తో ఇక్కడ అధికారులది ఆడింది ఆట పాడింది పాట లా వుంది.ఉన్నతాధికారులు మీటింగ్ లకు హైదరాబాద్,విజయవాడ కి తిరుగుతుండటం తో ఒక్క డిప్యుటీ సెక్రటరీ మాత్రమే అందుబాటులో వుంటున్నారు.సర్కులర్ చూసిన ఉద్యోగులు చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత పద్దతుల్లోకి వెళ్ళిపోయారా అని చెవులు కొరుక్కుంటున్నారు.

6 April 2016

ప్రకాశం జిల్లా లొ వలసలు



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బలమైన జిల్లాలో ఒకటైన ప్రకాశంజిల్లాలో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతోంది. ఆ జిల్లాకు సంబంధించిన నలుగురువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. గత సార్వ త్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు,1ఎంపీ,సీటు సాధించింది.వైసిపికి బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం.అధికార టిడిపిలోకి వలస వెళ్లే వారిలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్సంతనూతలపాడు(ఎస్పీ) ఎమ్మెల్యే అదిమూలపు సురేష్మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి,కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వలసలకు సంబంధించి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో ఇప్పటికే ప్రకాశంజిల్లా టిడిపి అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ మంతనాలు జరిపినట్లు సమా చారం. ఈ ఎమ్మెల్యేల రాకపట్ల ప్రకాశంజిల్లాకు చెందిన టిడిపి నేతలంతా సుముఖంగా  ఉండటంతో ఇక వీరి చేరిక దాదాపు ఖాయమన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిని చేర్చుకొనే విషయంలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ సైతం తమ సుముఖతను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశమంది పేరున్న ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పూడ్చరాని నష్టంవాటిల్లే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

2 April 2016

ravinuthala village water pumping video

అనంతపురం ప్రత్యక్ష రాజాకీయాల లొ శ్రీరాం

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర కుటుంబానికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌వీంద్ర హ‌ఠార్మ‌ర‌ణం త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న స‌తీమ‌ణి సునీత మూడుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి ఇప్పుడు బాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సునీత త‌న‌యుడు శ్రీరామ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప‌గ‌డ్బందీ ప్లాన్‌తో వ‌స్తున్నాడు.

ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు శ్రీరామ్ త‌న తండ్రి బాట‌లోనే ప‌య‌నిస్తున్నాడు. పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ గొడవల్లో తలమున‌క‌లై ఉన్న సమయంలో పేదల కోసం ఉచిత సామూహిక వివాహాలను చేయాలని సంకల్పించారు. ఒకేసారి వేలాది మందికి సామూహిక వివాహాలు ర‌వి ఆధ్వ‌ర్యంలో జ‌రిగేవి. అలా ఆయ‌న ఎంతోమంది గుండెల్లో స్థిర‌స్థాయిగా చోటు సంపాదించుకున్నారు. రవీంద్ర హత్యానంతరం కొంతకాలం ఈ సంప్రదాయానికి బ్రేక్‌పడింది. అయితే ఇప్పుడు ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్‌ ముందుకొచ్చారు.
శ్రీరామ్ ఆధ్వ‌ర్యంలో ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇది శ్రీ‌రామ్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు కూడా ఉప‌క‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఇక జిల్లాలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కే కాదు టీడీపీలో కూడా ర‌వి ఫ్యామిలీ ముఖ్యంగా సునీత‌, శ్రీరామ్ అంటే ప‌డని ప్ర‌త్య‌ర్థులు సైతం శ్రీరామ్ పొలిటిక‌ల్‌గా ఎదిగేందుకు వేస్తోన్న ఎత్తులు చూసి షాక‌వుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కోసం శ్రీరామ్ చంద్రబాబుతో పాటు లోకేష్‌,కరణం వెంకటెష్,రామొహన్ నాయుడు లాంటి యువ నాయుకుల తొ సైతం ట‌చ్‌లో ఉంటున్నార‌ని టాక్‌. రాప్తాడు లేదా పెనుగొండ‌ల‌లో ఎక్క‌డో ఓ చోట నుంచి శ్రీరామ్ బ‌రిలో ఉండే ఛాన్సులున్నాయి.