Search This Blog

14 April 2016

దుమ్ము రేపుతున్న చంద్రబాబు.

ఉచ్చ పోసుకుంటున్న ఉద్యోగులు అధికారులు..
ఆటం బాంబు లా ఉంటున్న చంద్రబాబునాయుడు ..
అందుకే ఆయన అడ్మినిస్ట్రేషన్‌ కి అమ్మా మొగుడు అనేదీ.
10:30 కి ఆఫీస్ 11:00 వరకు ఎవరు కనిపించరు 1:00 నుండి 2:00 వరకు లంచ్ బ్రేక్ 3:00 అయినా ఎవ్వరు సీట్లలో కనిపించరు 5:30 వరకు ఆఫీస్ కాని 4:30 కే అందరు బ్యాగ్ లు సర్దేస్తారు.ఎక్కడా?ఏమిటి అనుకుంటున్నారా?అదేనండి విభజన సమయం లో అవసరమయితే ఎక్కువ సమయం కేటాయిస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల తీరు ఇది.ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం సమయ పాలన పై ద్రుష్టి పెట్టింది.
అడిగి మరీ జీతాలు పెంచుకున్న ఉద్యోగులు ఇలా సమయ పాలన పాటించకపోవడం తో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం గా వుంది.ఇందుకోసం తాజా గా ఒక సర్కులర్ కూడా విడుదల చేసింది.ఈ సర్కులర్ ప్రకారం పదిన్నరకల్లా సెక్షన్ ఆఫీసర్ దగ్గర వుండే రిజిస్టర్ లో సంతకం పెట్టాలి.ఒక పది నిముషాలు గ్రేస్ పీరియడ్ వుంటుంది.10:40 కి రిజిస్టర్ డిప్యూటీ సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారి దగ్గరకి వెళ్తుంది.అక్కడ కూడా 11:30 వరకు మాత్రమే వుంటుంది.ఇలా మూడు సార్లు లేట్ అయితే సిఎల్ లేదా ఈఎల్ కట్ చేస్తారు.ఒకవేళ ఈ రెండు లేక పోతే ఎల్వోపి వేస్తారు.11:30 నుంచి 1:30 లోపు వస్తే హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తారు.
ఈ జీవో ని ఖచ్చితం గా పాటించాలని,రిజిస్టర్ లో ల విషయం లో ఖచ్చితం గా వుండాలని ఇటు ఉద్యోగులకు,అటు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారి చేసింది ప్రభుత్వం.చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తుండడం తో ఇక్కడ అధికారులది ఆడింది ఆట పాడింది పాట లా వుంది.ఉన్నతాధికారులు మీటింగ్ లకు హైదరాబాద్,విజయవాడ కి తిరుగుతుండటం తో ఒక్క డిప్యుటీ సెక్రటరీ మాత్రమే అందుబాటులో వుంటున్నారు.సర్కులర్ చూసిన ఉద్యోగులు చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత పద్దతుల్లోకి వెళ్ళిపోయారా అని చెవులు కొరుక్కుంటున్నారు.

No comments: