Search This Blog

30 June 2016

అద్దంకి నియోజకవర్గం

అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, కొరిశపాడు,పంగులూరు మండలాలు అద్దంకి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గ విస్తీర్ణం 1,006 చదరపు కి.మీ. 104 పంచాయతీలు, 76 ఎంపీటీసీ స్థానాలు, 28 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్లు) ఉన్నాయి.నియోజకవర్గం మీదుగా చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారి, నార్కెట్పల్లి- మేదరమెట్ల రాష్ట్రీయ రహదారులువెళ్తున్నాయి. వ్యవసాయం నియోజకవర్గంలో ప్రధానంగా వరి, శనగ, కంది, పత్తి, మొక్కజొన్న,మిర్చి, జూట్, పొగాకు, సుబాబుల్, పశుగ్రాసం, కూరగాయల పంటలు సాగవుతాయి. ఖరీఫ్, రబీల్లో కలిపి సుమారు 1.2 లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగు చేస్తారు. ఈ పంటల ద్వారా వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల విలువ సుమారు 300 కోట్లరూపాయలు ఉంటుంది. సాధారణ వర్షపాతం 804.4 మి.మీ. నమోదవుతుంది. సాగు యోగ్యమైన భూమి 79,982 ఎకరాలు కాగా సాగుకు అనువు కాని భూమి మరో 30 వేల ఎకరాలు ఉంటుంది. సాగు భూమి 55,292 కమతాలుగా ఉంది. సుమారు 50 వేల ఎకరాల భూమికి సాగునీటి వసతి ఉంది. ఈ సాగు భూమి నాగార్జునసాగర్ ఏబీసీ ఆయకట్టు కింద సుమారు 50వేల ఎకరాలు, చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద ఉంది. నియోజకవర్గంలో యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పర్యాటక కేంద్రాలు నియోజకవర్గంలో పేరొందిన పర్యాటక కేంద్రాలు ఏమీ లేవు. ప్రసిద్ధ దర్శనీయ క్షేత్రం శింగరకొండ పర్యాటక కేంద్రంగా ఇపుడిపుడే అభివృద్ధిని సాధిస్తోంది. శింగరకొండ, మణికేశ్వరం, రామకూరును పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. భవనాశి చరిత్ర శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం సమీపంలో సుమారు 750 ఎకరాల విస్తీర్ణంలో భవనాశి చెరువు విస్తరించి ఉంది. చెరువు కింది ఏడు వేల ఎకరాలు ఆయకట్టు సాగవుతోంది. 200 ఏళ్ల కిందట భవనాశి సరస్సుగా ఉన్న ఈ చెరువుకు 1919లో అడ్డుకట్ట కట్టడంతో చెరువుగా రూపాంతరం చెందింది. చెరువును రూ.27 కోట్ల వ్యయంతో శాశ్వత రిజర్వాయర్గా అభివృద్ధి చేస్తున్నారు. శాశ్వత రిజర్వాయరుగా ప్రస్తుత స్థిరీకరణ ఆయకట్టుతో పాటు మరో 5వేల ఎకరాలకు అదనంగా మొత్తం 12 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని అంచనా. చెరువు మధ్యలో ఐలాండ్ ఏర్పాటు చేసి బోట్షికారు ద్వారా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. వర్షాధారమైన ఈచెరువులో ఏడాది పొడవునా పుష్కలంగా నీరు నిల్వ ఉండేలా కనకొండ సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి కాలువ ద్వారా చెరువుకు నీరు చేర్చే పనులు కొనసాగుతున్నాయి.

No comments: